అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం ఏ(పిల్28(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు గంగారం మండలంలో మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు , గూడూరు సిఐ బాబురావు , గంగారం ఎస్సై రవికుమార్ మరియు వారి సిబ్బందితో కలిసి మండలంలోని గంగారం, కోమట్ల గూడెం, చింతగూడెం, జంగాలపల్లి, మర్రిగూడెం, కామారం, పొనుగొండ్ల గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల్లో ఉన్న పోలింగ్ బూత్ లను, ఓటర్లకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలతో నిర్వహించిన సమావేశాలలో మహబూబాబాద్ డిఎస్పి తిరుపతి రావు గారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసువారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, అక్రమ మద్యం, డబ్బు రవాణాకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. ఈకార్యక్రమంలో పోలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily