Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : .... * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ సెప్టెంబర్8(అక్షరం న్యూస్) మండలం లోని జంగాలపల్లి చిన్న తండ కోయగుంపు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలాలలో రెండు రోజుల నుంచి విద్యార్థులు వస్తున్నారు కానీ ఉపాధ్యాయుల జాడా లేదు దీంతో పాఠశాలాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక ఏంచేయాలో తోచక ప్రాంగణం లో కొద్ది సేపు ఆటలాడుకోని తిరిగి ఇంటికి వెళ్ళి పోతున్నారు ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలకు సరిగా హాజరు కాకపోవడంతో పిల్లలకు చదువు ఎవరు చెప్తురని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు
.
Aksharam Telugu Daily