Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 9 అక్షరం న్యూస్; రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కోసం అర్హులైన వారు రేషన్ కార్డు లేని పక్షంలో వారి కుటుంబ సభ్యుల వివరాలకు ఫోటో ద్వారా నిర్ధారణ చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు లక్షలు లోపు రుణమాఫీ అంశంపై ఆయన అక్షరం ప్రతినిధితో సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లక్షల లోపు పెద్దపల్లి జిల్లాలో 29 వేల 729 మంది రైతులకు 1049 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని అలాగే ₹1,50,000 లోపు 13401 మంది రైతులకు 1204 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని రెండు లక్షలు లోపు 8268 మంది రైతులకు 101 కోట్ల రుణమాఫీ జరిగిందని ఇప్పటివరకు జిల్లాలో 51393 మంది రైతులకు 375.58 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగినట్టు ఆయన వివరించారు. రెండు లక్షల రూపాయలకు పైన రుణమాఫీ జరిగిన రైతులు రేషన్ కార్డు లేని వారు తమ ఆధార్ కార్డులతో కుటుంబ సభ్యుల నిర్ధారణ కార్యక్రమం జిల్లాలోని సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారుల యాప్లో అప్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వారు నాలుగు లక్షల పైచిలుకు ఉన్నారని ఇప్పటివరకు మూడు లక్షల వరకు రైతులు అప్లోడ్ చేసుకున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో 12,619 మంది రైతులు రేషన్ కార్డు లేని వారు ఉన్నారని ఇప్పటివరకు 8500 మంది రైతులు రుణమాఫీ కోసం తమ కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డులతో అప్లోడ్ చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క రైతులకు రుణమాఫీ చేస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily