Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ సెప్టెంబర్ 13(అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య అన్నారు.శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కొత్తగూడ అటవీ శాఖ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పొడు వ్యవసాయం చేస్తున్న పోడు రైతులకు , ఈ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని,రైతులకు రుణ మాఫీ తో రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది అని, ఇంక పోడు రైతులకు ఎటువంటి సమస్యలైన స్థానిక అధికారులకు సమాచారం అందించాలాని,కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై చూపిస్తున్న కపట ప్రేమను విడి వరద బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్ డీ సి చైర్మన్ ను కలిసిన ఎఫ్ అర్ ఓ అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని మొదటి సారిగా కొత్తగూడ రేంజ్ కార్యాలయానికి వచ్చిన పోడెం వీరయ్య ను కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ పులా మొక్క తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఎఫ్ అర్ ఓ ను అడిగి తెలుసుకున్నారు.. భూపతి తిరుపతి నీ పరామర్శించిన పోడెం వీరయ్య. కొత్తగూడ మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి వాళ్ళ తల్లి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాగా,శుక్రవారం నాడు నిర్వహించిన దశ దిన కర్మలకు పోదెం వీరయ్య హాజరై తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి, మనో ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి,మహమ్మద్ రఫిక్,సిద్దబోయిన రాధ బిక్షం,సల్మాన్, ఉల్లెగుల రమేష్,ఉబ్బానీ శ్రీహరి, ఆలూరి రాజు,కల్తీ ఎల్లయ్య,బైరాబోయిన సదానందం, దుర్గం మురళి నేత,రాజు,వెంకన్న వీరన్న అభిమానులు,అనుచరులు పాల్గొన్నారు..
.
Aksharam Telugu Daily