Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -19(అక్షరం న్యూస్ ) నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందిఅనీ సంబధిత శాఖ అధికారులు తెలిపారు . ఈ దరఖాస్తుల ప్రక్రియకు చివరి తేదీ సెప్టెంబర్ 16 తేదీ అనీ,. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తుకు అర్హులు.అని తెలిపారు,విద్యార్థిని, విద్యార్థులు 01-05-2013 నుంచి 31-07-2017 మధ్య జన్మించిన వారు అర్హులు అని పేర్కొన్నారు ఉమ్మడి కరీంనగర్ గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ల ప్రైవేట్ పాఠశాలలో 3,4,5 తరగతులు చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీలోగా పాఠశాల సంబంధిత అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశ పరీక్ష తేదీ 18-01-2025న ఉంటుంది అనీ తెలిపారు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
.
Aksharam Telugu Daily