Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై 19(అక్షరం న్యూస్ ) తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని.రుణ మాపీ చారిత్రాత్మక నిర్ణయం అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అసంబ్లీ కో కన్వీనర్ కనమేని చక్రదర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎ ప్రభుత్వం చేయని సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసారని,కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, మాటిస్తే దానిపై నిలబడుతుందని మరోసారి రుజువైందని అన్నారు.రైతుల పక్షాన సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. గతంలో నిరుపేదలకు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రాజీవ్ ఇండ్ల పంపిణీ కూడా అర్హులకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇప్పుడు కూడా అర్హులైన తెల్ల రేషన్ కార్డు ఉన్న లేకున్నా భూమి ఉన్న రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. 16 సంవత్సరాల క్రితం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి 72వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని గుర్తు చేశారు.,
.
Aksharam Telugu Daily