Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /జులై 21/అక్షరం న్యూస్... మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, చిన్నకిష్టపురం గ్రామపంచాయతి, దేశ్యతండ గ్రామ ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితం అవుతుంది. గేట్ వాల్వ్ వద్ద వాల్ చెక్ పైపులు లికేజి మూలంగా గుంతలో వృధా నీరు, మురికి నీరు చేరి మురికిగా మారుతుంది. మురుగునీరు పైపు లైన్ లోకి చేరి తాగునీరు కలుషితం అవుతుంది. వర్షాల సమయం లో మురికి నీరు సరఫరా ఎక్కువగా అవుతుంది. సంవత్సరాలు గడుస్తున్న ఈ సమస్య పరిస్కారం కావడంలేదు. ఈ కలుషిత నీరు తాగి ప్రజలు జ్వరాలు, వీరేచనాలు బారిన పడుతున్నారు. ఈ సమస్యను గతంలో అనేక సార్లు ఎంపీడీఓ,మరియు గ్రామపంచాయతీ ప్రత్యేకధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిస్కారం దొరకలేదు. స్వచ్ఛమైన మంచినీరు అందించాలని, గేట్ వాల్వ్ వద్ద కలుషితమవుతున్న మురుగునిటీ సమస్య ను తక్షణమే పరిస్కార చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily