Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/తల్లాడ జూలై 18 (అక్షరంన్యూస్) ఎన్నికల్లో రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకున్నారని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. గురువారం తల్లాడ మేజర్ పంచాయతీ గ్రామ రైతు వేదిక ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలు రుణమాఫీ నిధులను లబ్ధిదారుల రైతుల ఖాతాలో వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి , తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తల్లాడ గ్రామ రైతు వేదికలో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం తల్లాడ గ్రామ, తల్లాడ మండలం రైతులు, రుణమాఫీ లబ్ధిదారులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, రుణమాఫీ రైతన్న సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సత్తుపల్లి ఏ డి ఏ నరసింహారావు, తాసిల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్, ఎస్సై కొండలరావు, మండల విద్యుత్ ఏఈ ఏ. రాజేష్, ఆర్ ఐ భాస్కర్, ఈవో మహేష్, ఏఈఓ గురుమూర్తి,కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గుల రఘుపతి రెడ్డి, రాయల రాము, రాయల భూషయ్య, దుండేటి వీరారెడ్డి, మారెళ్ళ మల్లికార్జునరావు, తాళ్ల జోసెఫ్,గణేశుల రవి, వేంరెడ్డి కృష్ణారెడ్డి,తుమ్మలపల్లి రమేష్, గుర్రం శ్రీనివాసరావు, ఎర్రి నరసింహారావు, కటిక కిరణ్ కుమార్, హనుమాన్ బుద్ధిసాగర్, పొట్టేటి జనార్దన్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, గొడుగునూరి లచ్చిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంజయ్య, కాంతారావు, బసవయ్య, మాజీ జెడ్పిటిసిలు మకార ప్రసాద్, కంచెపోవు వెంకటేశ్వర్లు, ఎక్కిరాల నాగేశ్వరరావు,రైతు సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily