Thursday, 19 September 2024 06:28:48 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి

- కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు - గణేష్ మండపాలను సందర్శించి శుభాకాంక్షలు తెలిపిన నేతలు...


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 14 September 2024 07:57 PM Views : 62

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/సెప్టెంబర్14/అక్షరం న్యూస్ :  భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇది భారత పౌరులుగా మనం గర్వంచదగ్గ విషయమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు శనివారం పట్టణ, పరిసర ప్రాంతాల్లోని మండపాలు సందర్శించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పండుగలు, ఉత్సవాలు ప్రజల మద్య ఐక్యత పెంచేందుకు, సోదరభావాన్ని పెంపొందించేందుకు వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. కులమతాలకతీతంగా అన్ని పండుగలు కలిసిమెలిసి జరుపుకోవడం మన ప్రాంతంలోనే కాకుండా యావత్ దేశంలో జరుపుకోవడం ఐక్యతకు నిదర్శనమన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమేకాకుండా పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందరికి ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ ఆనవాయితీని భవిష్యత్తులో మరింత ఉత్సహంగా నిర్వహించాలని సూచించారు. మండపాలవద్ద పారిశుద్ధ్య సమస్య, విద్యుత్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఉత్సవ కమిటీల భాద్యులు కూనంనేనిని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషాను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు దుర్గరాశి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి మురళి, గెద్దాడు నగేష్, పోలమూరి శ్రీనివాస్, రాంజి, కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, సుగుణ, పిడుగు శ్రీనివాస్, నేరెల్ళ సమైక్య, లగడపాటి రమేష్, పి.సత్యనారాయణచారి, బోయిన విజయ్ కుమార్, యూసుఫ్, ధర్మరాజు, దాసరి శ్రీనివాస్, నేరెళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :