Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 16 (అక్షరం న్యూస్) అన్ని గ్రామాలలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఆదేశించారు ఈ సందర్భంగా సోమవారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల్లో గణేష్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా నిమజ్జనం చేసే చెరువులు కుంటల వద్ద ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరిగే విధంగా అన్ని చర్యలు ఎస్ఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని భక్తులు సమన్వయంతో గణేష్ శోభయాత్రను మంచి పండుగ వాతావరణం లో ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ సుబ్బారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సై జి అశోక్ రెడ్డి ఏఎస్ఐ ఎస్ సుధాకర్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ కానిస్టేబుల్ రాజు అశోక్ రాజేందర్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily