Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్10/అక్షరం న్యూస్... రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ఊర్లు, ఏర్లు అన్ని ఏకమై వందలాది గ్రామాలు జలదిగ్బంధనానికి గురయ్యాయని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి జీ సక్రులు అన్నారు. అఖిలభారత రైతుకుల సంఘం కేఐకేఎంఎస్ జిల్లా కమిటీ బృందం గత ఎనిమిది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసి జరిగిన నష్టాన్ని వినతిపత్రం ద్వారా సమర్పించడం, తెలియపరచడం జరిగింది.జిల్లాలోఇప్పటి వరకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకార జిల్లాలో ప్రాణా నష్టం జరిగి కొంతమంది వరదల్లో చిక్కుకొని మృతి చెందారని, కొంతమంది గల్లంతయ్యారని,వారి ఆచూకీ ఇంకా తెలియ రావడం లేదన్నారు.రోడ్లు, రైల్వే లైన్లు ధ్వంసమై రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని,రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారన్నారు.ఈ వర్ష బీభత్సం వలన వ్యవసాయ రంగం కుదేలైందని,జిల్లాల్లో వేలాదిఎకరాల్లో పంట నష్టం సంభవించిందని,జిల్లావ్యాప్తంగా ఒకటి రెండు మండలాల్లో ఐదు ఆరు చెరువుపైగా తెగిపోయాయన్నారు.వేలాది ఎకరాల పంటభూములు కోతకు గురవటంతో పాటు పొలాల్లో ఇసుక మేటలు పెట్టి సేద్యానికి పనికి రాకుండా పోయాయన్నారు.ప్రధానంగా కొన్ని మండలాలలో భారీగా పంట నష్టం సంభవించింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో ప్రజానీకం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ప్రకృతి విపత్తుగా పరిగణించినందున యుద్ధ ప్రాతిపదికపై జిల్లాలో సహాయక చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వానికి కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న,రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి జి సక్రు, జిల్లా సహాయ కార్యదర్శి ఆళ్లకొండ సాయిలు, పాపన్న,న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హలావత్ లింగన్న తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily