Thursday, 19 September 2024 06:43:47 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి...

గౌని ఐలయ్య సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 13 September 2024 02:18 PM Views : 34

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... బాధిత కుటుంబాలను పరామర్శించిన న్యూడెమోక్రసీ బృందం... మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్13/అక్షరం న్యూస్... మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం రామచంద్రపురం పంచాయతీలో రామగుండాల, పెంకు తండా, కొత్త తండా గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ఇండ్లు దెబ్బతిన్నాయని,కొన్ని ఇండ్లు పూర్తిగాను మరికొన్ని పాక్షికంగాను ద్వంశమయ్యాయని బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ బృందం బయ్యారం మండలంలోని వివిధ పంచాయతీలో పర్యటించి బాధితులని పరామర్శించారు.ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య ప్రసంగిస్తూ, కొత్తతండా, పెంకుతండాలలో సుమారు 15 ఇండ్లు వర్షాలకు దెబ్బతిన్నాయని వారందరికీ ప్రభుత్వం నూతన ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధికారులు ఆ పంచాయతీలో 2,3 మాత్రమే కూలినట్లు రికార్డులో చూపిస్తున్నారని, సమగ్ర పరిశీలన జరిపి భారీ వర్షాల వలన ఇండ్లు దెబ్బతిన్న వారందరినీ ఆదుకోవాలని ఆయన అన్నారు. పంటలు నష్టపోయిన వారిని సైతం ఇంతవరకు అధికారులు సందర్శించలేదన, వర్షాలకు నష్టపోయిన పంట పొలాలన్నిటికీ నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. రామగుండాల, కొత్తతండా, పెంకుతండాలలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమైన నాలుగు కుటుంబాలకు న్యూడెమోక్రసీ బృందం నిత్యవసర వస్తువులు, బట్టలు అందజేశారు.బయ్యారంకు చెందిన దాతలు చల్లగుండ్ల గోపయ్య, కత్తి రమేష్ గార్ల సహకారంతో బియ్యం, పప్పు, మంచి నూనె, ఉల్లిగడ్డలు, చింతపండు, చద్దర్లు,బట్టలు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బానోతు నరసింహ, పార్టీ ప్రజాసంఘాల నాయకులు కొదుమూరి నాగేశ్వరరావు, భూక్య రాము, గుగులోతు ధర్మ, సజ్జా జలేంధర్, చందనబోయిన ఉపేందర్, దొండ మల్లయ్య, గట్ల లచ్చయ్య, హరిచంద్, మాడే రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :