Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... బాధిత కుటుంబాలను పరామర్శించిన న్యూడెమోక్రసీ బృందం... మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్13/అక్షరం న్యూస్... మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం రామచంద్రపురం పంచాయతీలో రామగుండాల, పెంకు తండా, కొత్త తండా గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ఇండ్లు దెబ్బతిన్నాయని,కొన్ని ఇండ్లు పూర్తిగాను మరికొన్ని పాక్షికంగాను ద్వంశమయ్యాయని బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ బృందం బయ్యారం మండలంలోని వివిధ పంచాయతీలో పర్యటించి బాధితులని పరామర్శించారు.ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య ప్రసంగిస్తూ, కొత్తతండా, పెంకుతండాలలో సుమారు 15 ఇండ్లు వర్షాలకు దెబ్బతిన్నాయని వారందరికీ ప్రభుత్వం నూతన ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధికారులు ఆ పంచాయతీలో 2,3 మాత్రమే కూలినట్లు రికార్డులో చూపిస్తున్నారని, సమగ్ర పరిశీలన జరిపి భారీ వర్షాల వలన ఇండ్లు దెబ్బతిన్న వారందరినీ ఆదుకోవాలని ఆయన అన్నారు. పంటలు నష్టపోయిన వారిని సైతం ఇంతవరకు అధికారులు సందర్శించలేదన, వర్షాలకు నష్టపోయిన పంట పొలాలన్నిటికీ నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. రామగుండాల, కొత్తతండా, పెంకుతండాలలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమైన నాలుగు కుటుంబాలకు న్యూడెమోక్రసీ బృందం నిత్యవసర వస్తువులు, బట్టలు అందజేశారు.బయ్యారంకు చెందిన దాతలు చల్లగుండ్ల గోపయ్య, కత్తి రమేష్ గార్ల సహకారంతో బియ్యం, పప్పు, మంచి నూనె, ఉల్లిగడ్డలు, చింతపండు, చద్దర్లు,బట్టలు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బానోతు నరసింహ, పార్టీ ప్రజాసంఘాల నాయకులు కొదుమూరి నాగేశ్వరరావు, భూక్య రాము, గుగులోతు ధర్మ, సజ్జా జలేంధర్, చందనబోయిన ఉపేందర్, దొండ మల్లయ్య, గట్ల లచ్చయ్య, హరిచంద్, మాడే రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily