Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్13/అక్షరం న్యూస్... సామజిక, ఆహారపు అలవాట్ల మార్పుతో పోషకహార లోప నివారణ చేయవచ్చునని, పిల్లలు ఆరోగ్యం, సమతుల్య ఆహారంపై శ్రద్ధ తీసుకోవాలని సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ ఎం. ఉషారాణి అన్నారు. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలపరిధిలోని సీతంపేట గ్రామపంచాయతీ, మంగలితండ అంగన్వాడీ కేంద్రంలో పోషకహార మాసోత్సవాలు లో భాగంగా కిషోరబాలికలకు అవగాహనా కల్పించారు. అనంతరం ఎం. ఉషారాణి మాట్లాడుతూ, కిషోరబాలికలు సంపూర్ణ పోషకహారం తీసుకోవాలని, ఆకు కూరలపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మాతాశిశువులకు మంచి పౌష్టికహారాన్ని అందించడం ద్వారా శిశు మరణాలను నియంత్రించవచ్చు అన్నారు. పౌష్టికహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. పరిశుభ్రమైన మంచినీటిని తీసుకోవాలని అన్నారు. అనంతరం కిషోరబాలికలకు పల్లిపట్టి పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రాధానోపాధ్యాయులు విరభద్రం, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు మాలోత్ నీలాదేవి, శైలజ, రుక్కమ్మ, సుజాత, అరుణ, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily