Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్9/అక్షరం న్యూస్... మార్కిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ మావో 48 వ వర్ధంతి సందర్భంగా గార్ల మండలం, గోపాలపురం గ్రామంలో సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మావో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జి.సక్రు మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో మావో ఒకరు అన్నారు.చైనాలో భూస్వామ్య విధానాన్ని రద్దు చేయుటకు కామ్రేడ్ మావో నాయకత్వంలో సుదీర్ఘ సాయుధ పోరాటం జరిగిందని అన్నారు.చైనాలో విప్లవాన్ని విజయవంతం చేయడంలో సోవియట్ యూనియన్ సహాయం తీసుకున్నాడని అన్నారు. చైనాలో మావో నాయకత్వంలో లాంగ్ మార్చ్ చేసి చరిత్రలో నిల్చున్నారన్నారు.విప్లవం విజయవంతమైన తర్వాత కూడా సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చారు. పాత ఆచారాలు,అలవాట్లు, ఆలోచనలు ,సంస్కృతిలో తుదిముట్టించుటకు తీవ్ర కృషి చేశారన్నారు.చైనాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక మావో ప్రపంచమంతట ఆయన ఆలోచనలు సుపరిచితం చేశారని కొనియాడారు. మావో ఆలోచనలు ఆచరిస్తూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి సిహెచ్ గణేష్ ,మట్టపల్లి వీరభద్రం ,గోళ్ల మాధవ రావు,ఎర్రబోయిన రుక్మారావు, గుత్తుల కొండలరావు ,బయ్య కొండలరావు ,చెవుల మల్లయ్య ,పొదిల మల్లయ్య, కేలోత్ బద్రి ,రామకృష్ణ తదితరులు పాల్గొన్బయ్య.
.
Aksharam Telugu Daily