Thursday, 19 September 2024 05:47:37 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

మావో ఆలోచన విధానాన్ని దృఢంగా ముందుకు తీసుకువెళ్దాం

మావోను స్మరించుకుంటూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేద్దాం... జి. సక్రు సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి...


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 09 September 2024 02:52 PM Views : 86

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్9/అక్షరం న్యూస్... మార్కిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ మావో 48 వ వర్ధంతి సందర్భంగా గార్ల మండలం, గోపాలపురం గ్రామంలో సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మావో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జి.సక్రు మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో మావో ఒకరు అన్నారు.చైనాలో భూస్వామ్య విధానాన్ని రద్దు చేయుటకు కామ్రేడ్ మావో నాయకత్వంలో సుదీర్ఘ సాయుధ పోరాటం జరిగిందని అన్నారు.చైనాలో విప్లవాన్ని విజయవంతం చేయడంలో సోవియట్ యూనియన్ సహాయం తీసుకున్నాడని అన్నారు. చైనాలో మావో నాయకత్వంలో లాంగ్ మార్చ్ చేసి చరిత్రలో నిల్చున్నారన్నారు.విప్లవం విజయవంతమైన తర్వాత కూడా సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చారు. పాత ఆచారాలు,అలవాట్లు, ఆలోచనలు ,సంస్కృతిలో తుదిముట్టించుటకు తీవ్ర కృషి చేశారన్నారు.చైనాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక మావో ప్రపంచమంతట ఆయన ఆలోచనలు సుపరిచితం చేశారని కొనియాడారు. మావో ఆలోచనలు ఆచరిస్తూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి సిహెచ్ గణేష్ ,మట్టపల్లి వీరభద్రం ,గోళ్ల మాధవ రావు,ఎర్రబోయిన రుక్మారావు, గుత్తుల కొండలరావు ,బయ్య కొండలరావు ,చెవుల మల్లయ్య ,పొదిల మల్లయ్య, కేలోత్ బద్రి ,రామకృష్ణ తదితరులు పాల్గొన్బయ్య.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :