Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... ... మహబూబాబాద్ /గార్ల /సెప్టెంబర్9/అక్షరం న్యూస్... కరెంట్ మీటర్లు లేని, విద్యుత్ వినియోగదారులకు రేషన్ కార్డుతో సంబందం లేకుండా, ఎలాంటి షరతు లు పెట్టకుండా సబ్సిడి పై కొత్త విద్యుత్ మీటర్లు అందించాలని సిపిఐ రాష్ట సమితి సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ కట్టేబోయిన శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో కట్టేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ, గత బిఅర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ పాటు కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు, కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికీ,పాత కార్డు నుండి తీసి వేయ బడ్డ వారు వేలల్లో ఉన్నందున, విద్యుత్ శాఖా వారు సబ్సిడి పై అందిస్తున్న కొత్త విద్యుత్ మీటర్ల ను ఎలాంటి షరతులు లేకుండా అందివ్వాలని డిమాండ్ చేశారు.
.
Aksharam Telugu Daily