Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 13 (అక్షరం న్యూస్) శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటిని ముట్టడి చేయడం కోసం వెళ్తున్న ఓదెల మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన ఎస్సై జి అశోక్ రెడ్డి ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నిన్న హైదరాబాదులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి జరగా హైదరాబాద్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముట్టడి కోసం అధిష్టానం పిలుపు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా పోలీసులను పెట్టి ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ప్రజాస్వామ్యమని 9 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నైతిక రాక్షస రౌడీ రాజ్యంలో ప్రజాస్వామ్య. హక్కులను హరింపజేయపడుతున్నాయని రాజ్యాంగం విలువలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామిక వ్యతిరేక పాలన సాగిస్తూ నైతిక రాజ్యాంగ విలువలను ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలు గమనిస్తున్నారని అక్రమంగా అన్యాయంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలకు లాగుతూ రాజ్యాంగ విలువలను దిగజారుతున్నారని ఈ స్థితిలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రేవంత్ రెడ్డి పాలను ఎదిరిస్తూ జరిగే పోరాటంలో భారీ ఎత్తున పాల్గొనాలని అన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పతనం ఖాయమని అన్నారు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై దాడులే హేయంగా ఇండ్ల పై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ రాష్టములో పోలీస్ పాలన జరుగుతుందని, వెంటనే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేసిన అరికెపూడి గాంధీ అతని కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,మాజీ సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి,కనికిరెడ్డి సతీష్,రౌతు జలపతి,జోంగోని వెంకటేష్ గౌడ్, చింతం మొగిలి, గడ్డం శ్యామ్,రంగు రంజిత్ బోగే సదానందం,పరశురాములు ఉన్నారు
.
Aksharam Telugu Daily