Thursday, 19 September 2024 06:31:11 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 16 September 2024 08:30 PM Views : 77

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/సెప్టెంబర్ 16/అక్షరం న్యూస్ :  అధ్యయనం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి సంతాప కార్యక్రమాన్ని  మంచికంటి భవన్ లో ఆదివారం   నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి ముందుగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ ఏజె రమేష్ అధ్యక్షతన జరిగిన సభలో మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..  కామ్రేడ్ ఏచూరి నిరంతరం అధ్యయనం చేస్తూ సమాజ పరిణామక్రమాన్ని భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అంచనా వేసి పోరాటాలకు శ్రీకారం ఎలా చుట్టాలి అనేది రూపకల్పన చేసి నూతన సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు.  విద్యార్థి దశ నుంచే అధ్యయనంపై మక్కువ పెరిగి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో భారతదేశానికి దిక్సూచిగా ఉండాలి అని అకుంఠిత దీక్షతో భారత దేశ నిర్మాణంలో విద్యార్థులకు కీలకపాత్ర పోషించాలని సమ సమాజ స్థాపనకై విద్యానభ్యసిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తలచి తోటి విద్యార్థులతో చర్చగోస్టులు చేసి ప్రపంచ మేధావులు రచించిన పుస్తకాలను అధ్యయనం చేసి తోటి విద్యార్థులకు వివరించేవారని,  తను నిత్యం ఆచరిస్తూ కమ్యూనిజం సిద్ధాంతాన్ని అపోసన పట్టుకొని భావితరాలకు మార్గదర్శకం అయ్యరాన్నారు . మన భారతదేశంలో ఉన్న ప్రముఖులే కాక ప్రపంచంలో ఉన్న మేధావులు సైతం గర్వించదగ్గ గొప్ప సైబంతిక వేత్త అని అన్నారు. రాజకీయాలలో ప్రవేశం చేసి అంచలంచలుగా పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన సమయంలో బూర్జువా పార్టీలతో వస్తున్న అనేక సైద్ధాంతిక  సమస్యలపై అవగాహన కలిగి ఉండే వారన్నారు. దేశం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో.. ఒకవైపు మతోన్మాద భావాలు కలిగిన రాజకీయాలు మరోవైపు అన్ని వర్గాలపై భారాలు మోపే పాలకవర్గ విధానాలపై సమానంగా పోరాటాలు నిర్వహిస్తూ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీలు సరైన మార్గంలో నడిచే విధంగా ఆలోచనలు చేయడంలో దిట్టగా ఆయన నిలిచారనీ అన్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి సమస్యపై నిరంతరం అధ్యయనం చేసి స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లేలా ఆలోచన చేసేవారని ఆయన అన్నారు. ఉన్నత సామాజిక వర్గ కుటుంబంలో పుట్టినా కూడా తన ఆలోచనలు, ఆచరణ అన్ని వర్గాల ప్రజల కోసం అహర్నిశలు ప్రజల కోసం శ్రమించిన మహా నాయకుడు కామ్రేడ్ ఏచూరి అని అన్నారు. అధ్యయనం పోరాటం నినాదాన్ని ఉనికిపుచ్చుకొని కడవరకు పోరాటాలు చేసే ఎర్రజెండా ను వదలకుండా చివరి కంటూ జనం కోసం పాటుపడిన ఒక మేధావిని ప్రపంచం కోల్పోయిందని ఆయన అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కలలుకున్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ప్రతి సమస్యపై అధ్యయనం చేస్తూ భౌతిక పరిస్థితులు అంచనావేసి నిరంతరం జనం కోసం పాటుపడాలని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ భూక్య రమేష్ స్టడీ సర్కిల్ సభ్యులు కే సత్య , నందిపాటి రమేష్, ఉపేష్, రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :