Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి ప్రతినిధి జులై 22 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో గాండ్ల తిలకుల జిల్లా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. వర్షం పడుతున్న లెక్కచేయకుండా గాండ్ల తిలకుల కుల సంఘం సభ్యులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంఘం జిల్లా ఎన్నికలలో సంగెం వెంకటరాజం, లెక్కల నగేష్ ప్యానెల్ పోటీ పడగా హోరాహోరీగా సాగిన ఎన్నికలలో వెంకట్రాజం ప్యానల్ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికలలో 638 మంది కుల సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, వెంకట్రాజన్ ప్యానల్ కు 372 లెక్కల నగేష్ ప్యానెల్ కు 250 ఓట్లు నమోదు అయ్యాయి. మరో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. 112 ఓట్లతో వెంకటరాజం ప్యానెల్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధాన కార్యదర్శిగా చంద సతీష్, ఉపాధ్యక్షులుగా ఎర్రంశెట్టి సత్యనారాయణ, కోశాధికారిగా జక్కం మధుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెల్ది రాజమల్లు, సహాయ కార్యదర్శిగా రామభక్తుల మహేందర్, కార్యవర్గ సభ్యులుగా రామ భక్తుల మల్లేశం ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని కుల సంఘం సభ్యులు ఘనంగా శాలువాతో పూలమాలలు వేసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రాజం, సంద సతీష్ మాట్లాడుతూ కుల సంఘం అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కుల సంఘం సభ్యుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఎవరు ఈ ఆపద వచ్చిన తమను సంప్రదించాలని కోరారు. ఎన్నికల నిర్వహణ అధికారులుగా జక్కం సత్యనారాయణ జక్కం రమేష్ జక్కం మారుతి పిల్లలమర్రి సత్తయ్య రాజేంద్ర రమేష్ వ్యవహరించారు.
.
Aksharam Telugu Daily