Sunday, 08 September 2024 08:24:45 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

ఉత్కంఠ భరితంగా గాండ్ల తిలకుల జిల్లా సంక్షేమ సంఘం ఎన్నికలు..

సంగెం వెంకటరాజం ప్యానెల్ ఘనవిజయం ... జిల్లా అధ్యక్షులుగా వెంకటరాజం ... ప్రధాన కార్యదర్శిగా చంద సతీష్ ఎన్నిక


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 21 July 2024 06:32 PM Views : 1164

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి ప్రతినిధి జులై 22 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో గాండ్ల తిలకుల జిల్లా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. వర్షం పడుతున్న లెక్కచేయకుండా గాండ్ల తిలకుల కుల సంఘం సభ్యులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంఘం జిల్లా ఎన్నికలలో సంగెం వెంకటరాజం, లెక్కల నగేష్ ప్యానెల్ పోటీ పడగా హోరాహోరీగా సాగిన ఎన్నికలలో వెంకట్రాజం ప్యానల్ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికలలో 638 మంది కుల సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, వెంకట్రాజన్ ప్యానల్ కు 372 లెక్కల నగేష్ ప్యానెల్ కు 250 ఓట్లు నమోదు అయ్యాయి. మరో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. 112 ఓట్లతో వెంకటరాజం ప్యానెల్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధాన కార్యదర్శిగా చంద సతీష్, ఉపాధ్యక్షులుగా ఎర్రంశెట్టి సత్యనారాయణ, కోశాధికారిగా జక్కం మధుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెల్ది రాజమల్లు, సహాయ కార్యదర్శిగా రామభక్తుల మహేందర్, కార్యవర్గ సభ్యులుగా రామ భక్తుల మల్లేశం ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని కుల సంఘం సభ్యులు ఘనంగా శాలువాతో పూలమాలలు వేసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రాజం, సంద సతీష్ మాట్లాడుతూ కుల సంఘం అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కుల సంఘం సభ్యుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఎవరు ఈ ఆపద వచ్చిన తమను సంప్రదించాలని కోరారు. ఎన్నికల నిర్వహణ అధికారులుగా జక్కం సత్యనారాయణ జక్కం రమేష్ జక్కం మారుతి పిల్లలమర్రి సత్తయ్య రాజేంద్ర రమేష్ వ్యవహరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :