Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్9/అక్షరం న్యూస్... మహబూబాబాద్ జిల్లా, కంబాలపల్లి గ్రామంలో కామ్రేడ్ మావో 48వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే బాబన్న అధ్యక్షతన నిర్వహించిన సభలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె మదార్ మాట్లాడుతూ,1976 చైనాలో కామ్రేడ్ మావో అమరత్వం పొందారని,కామ్రేడ్ మావో నాయకత్వంలో చైనా దేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఎంచుకొని గ్రామీణ ప్రాంతాలలో ప్రజా సమస్యలను తీసుకొని గ్రామీణ ప్రజలను పోరాటాల వైపు వచ్చే విధంగా కృషిచేసి ప్రజా గేరిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేస్తూ పట్టణ ప్రాంతాలలో కూడా కార్మికులను వివిధ వర్గాల ప్రజలను చైతన్య పరుస్తూ చైనా దేశంలో ఓ పెద్ద ఎత్తున మావో నాయకత్వంలో పోరాటాలు జరిగినాయని అన్నారు.లక్షలాది మంది అమరవీరుల త్యాగంతో చైనాలో కమ్యూనిస్టు రాజ్యాన్ని తీసుకొచ్చి భేదాలు లేకుండా ప్రజారాజ్యాన్ని కామ్రేడ్ మావో స్థాపించారన్నారు. కామ్రేడ్ మావో పోరాట స్ఫూర్తిని తీసుకొని భారతదేశంలో ప్రజలు అనేక ఉద్యమాలు విప్లవకారుల నాయకత్వంలో చేస్తున్నారన్నారు.విప్లవ కారులు చేస్తున్న ప్రజా పోరాటాలను అణచివేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు వేస్తూ ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదాన్ని మోపుతూ ప్రజానాయకులను ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తూ,జైళ్ల పాలు చేస్తున్నారన్నారు.భారతదేశంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కుతూ ప్రజలపై ప్రభుత్వాలు ధమన కాండను కొనసాగిస్తున్నాయి కావున మావో చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ప్రజా ఉద్యమాలలో అమరులైన అమరుల త్యాగాల స్ఫూర్తిగా ప్రజలందరూ ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ధమనకాండకు, నిర్బంధానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు సనప పోమ్మయ్య, ఉపేందర్, రామచంద్రు, పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు బానోత్ దేవేందర్, అరుణోదయ నాయకులు బద్దుల పాపయ్య, పార్టీ స్థానిక నాయకులు యాస రంగన్న, నరసన్న, వీరన్న, వెంకన్న, లింగన్న, కల్క, ఎలమంచమ్మ, రాజన్న, భద్రన్న, కొమరయ్య, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily