Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : .. రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -20(అక్షరం న్యూస్ ) తెలంగాణ ప్రభుత్వం హైస్కూల్ టైమింగ్స్ మార్పు చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు పనివేళలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు పనివేళలు మార్పు చేస్తూ విద్యాశాఖ ఉన్నత పాఠశాలల పనివేళల మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు ఓపెన్ ఉంటాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పాఠశాలల్లోని పని వేళల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ పాఠశాలలో విద్యుత్ తో పాటు మరుగు దొడ్లు ఉండేలా చర్యలు తీసుకోనుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా వరకు టైమ్ కు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది అయితే పాఠశాల ప్రారంభం అయిన రెండు మూడు గంటలకు వస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
.
Aksharam Telugu Daily