Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భీమదేవరపల్లి/ హనుమకొండ : హనుమకొండ/భీమదేవరపల్లి/సెప్టెంబర్ 08(అక్షరం న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గొల్లిపల్లి దివ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మడికొండ ఎస్సై గా పనిచేసిన దివ్య, బదిలీపై వంగరకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఇదివరకు పనిచేసిన ఎస్సై వెంకటేశ్వర్లు దుగ్గొండి కి బదిలీపై వెళ్లారు.
.
Aksharam Telugu Daily