Thursday, 19 September 2024 06:27:36 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

ఓదెల మండలంలో జిల్లా పాలనాధికారి కోయ హర్ష విస్తృత పర్యటన పలు పాఠశాలలు తనిఖీ

విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు పటిష్ట చర్యలు పాలనాధికారి కోయ శ్రీ హర్ష


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 12 September 2024 05:27 PM Views : 515

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 12 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలో జిల్లా పాలనాధికారి కోయ హర్ష విస్తృత పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా కనగర్తి గ్రామంలో దాసరి హనుమయ్య జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలన చేశారు ప్రతి గదిని పరిశీలించి పాఠశాలలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువుపై.అడిగి తెలుసుకున్నారు అనంతరం వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా అవేన్యూ ప్లాంటేషన్ క్రింద నాటిన మొక్కల సంరక్షణకు కార్యాచరణ చేపట్టాలని అన్నారు ఈ సందర్భంగా కనగర్తి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు పాఠశాలకు సంబంధించిన భూమి కబ్జాకు గురవుతుందని దాన్ని కాపాడాలని పాలనాధికారికి వివరించారు అదేవిధంగా పశువుల దవాఖాన కు సరైనటువంటి వైద్యులు లేరని ప్రతి దానికి గోపాలమిత్ర వైద్యుడిపై ఆధార పడవలసి వస్తుందని వారు కూడా సమయానికి రాకపోవడంతో పశువులకు వైద్యం చేయించుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నాయని దానిపై వెంటనే చర్య తీసుకొని ఒక వైద్యున్ని ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కనగర్తి గ్రామంలోని దాసరి హనుమయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వెటర్నరీ హాస్పిటల్, పల్లె దవఖానాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులను వినియోగించుకుంటూ విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని , ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ల్యాబ్ లో అవసరమైన అదనపు ఫ్యాన్ లైట్ సౌకర్యం వెంటనే కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పల్లె దవాఖానాలో గ్రామంలోని వైరల్ జ్వరాలు గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్ గ్రామంలో పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం కనగర్తి పాఠశాలకు సంబంధించిన భూమి ఆక్రమణ గురైతుందని దానిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు మడక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు మడక ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అదనపు పోషకాలు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం ఓదెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తహసిల్దార్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రాథమిక విద్యా ప్రమాణాలను పరీక్షించిన కలెక్టర్ ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలైనా చదవడం రాయడం, గణితం వంటివి వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిఇఓ సంధ్యారాణి జిల్లా పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ జగదీష్ తాసిల్దార్ బి యాకన్న డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్ పంచాయతీ ఇన్స్పెక్టర్ రమేష్ మహేష్ ఓదెల ఓదెల ప్రాథమిక వైద్యాధికారి సాయ బేజి ఖాన్ ఎంపీడీవో. జి తిరుపతి, ఏపీఎం, షబ్బీర్ భాష వ్యవసాయ శాఖ మండల అధికారి భాస్కర్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య ఐకెపి ఏపీఎం లతా మంగేశ్వరి అంగన్వాడి సూపర్వైజర్ ఉమాదేవి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :