Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... . మహబూబాబాద్ /గార్ల /జులై 20/అక్షరం న్యూస్... గార్ల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రయాణికుల సౌకర్యార్ధం శాతవాహన, ఇంటర్ సిటీ ఎక్ష్ప్రెస్స్ రైళ్లను నిలుపుదల చేయాలనీ రైల్వే ప్రయాణికుల కమిటీ నాయకులు జడ సత్యనారాయణ, వజ్రం నాగేశ్వరావు, ఈశ్వర్ లింగం కోరారు. గార్ల రైల్వే స్టేషన్ నైజాం నవాబ్ కాలం నుండి పేరుగాంచినదని, మరియు సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు ఏజెన్సీ ఏరియాలో గార్ల రైల్వే స్టేషన్ ఒకటి మాత్రమే కలదు అని తెలిపారు.గార్ల రైల్వేస్టేషన్లో అత్యధికంగా గిరిజనులు, వ్యాపారస్తులు, విద్యార్థి, యువకులు,బడుగు, బలహీన వర్గాల వారు అనేకమంది సుదూర ప్రాంతాల్లో రైల్వే ప్రయాణం చేసేవారు అత్యధికంగా ఉన్నారని అన్నారు. గార్ల రైల్వేస్టేషన్ లో రెవెన్యూ కూడా పలు రైల్వే స్టేషన్ల కన్నా అత్యధికంగా ఉంటుందని అన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలు నిత్యం తెలిసి ఉంటుంది కాబట్టి గార్ల రైల్వే స్టేషన్లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శాతవాహన, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నిలుపదలకు కృషి చేయాలని అలాగే గార్ల రైల్వే స్టేషన్ ఎంతో ప్రసిద్ధిగాంచి ఉన్నందున గార్ల రైల్వే స్టేషన్ అప్డేట్ చేయించాలని, రైల్వే స్టేషన్ లో సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైల్వే ప్రయాణికుల కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్ లింగం, వజ్రం నాగేశ్వరరావు, జడ సత్యనారాయణ, రాజశేఖర్, జంపాల వెంకన్న, శాంతి కుమార్,దువ్వ సతీష్,ఇర్రి రవి, బబ్లు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily