Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /సెప్టెంబర్ -08(అక్షరం న్యూస్ ) ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్’ను ఏర్పాటు చేయడం తో పాటు విద్యా శాఖ కమిషన్ ఛైర్మన్గా మాజీ జయ శంకర్ భూపాలపల్లి కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన ఆకునూరి మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నియామకం చేపట్టడంతో అధివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వారికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాల్యంలో ఎన్నో కష్టాలను తట్టుకొని ,చదువుకుంటనే భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, విద్యారంగంపై ఎనలేని పట్టున్న వ్యక్తి ని ముఖ్యమంత్రి నియామించడం అభినందనియమని అన్నారు. యూనివర్సిటీల్లో పబ్లికేషన్ల సంఖ్య తగ్గడం, పరిశోధన కార్యకలాపాలు కుంటుపడుతుండటంతో వర్తమాన మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పులకు రోడ్మ్యాప్ను ఖరారు చేసింది అని . ఆ బాధ్యతలను విద్యాకమిషన్కు అప్పగించింది అన్నారు . ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సూచనలు అంద చేస్తుంది అని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని తీర్చి దిద్దడానికి వీలుగా కమిషన్ పని చేస్తుంది అని తెలిపారు. విద్యా కమిషన్ ఏర్పటు చేసి చేర్మెన్ నియామకము చేపట్టిన మంత్రి రేవంత్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలియచేశారు
.
Aksharam Telugu Daily