Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల /సెప్టెంబర్ -09(అక్షరం న్యూస్ ) పద్మభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు 110వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా , బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్బంగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి మాట్లాడుతూ.కాళోజీ . అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా సావవేందుకుర అని తెలుగు భాష, తెలంగాణ యాస ను వెలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కాళోజీ నా గొడవ తెలంగాణ సామాజిక అంశాలను, జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా స్పృశించిన విధానం. కాళోజి కే దక్కుతుంది అని అన్నారు .కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని ఆయన సేవలను కొనియాడారు.కొందరు మరణించినా ప్రజల మనస్సులో ఎల్లప్పుడూ జీవించే వారు కొందరే ఉంటారని, అందులో కాళోజీ నారాయణ రావు ఒకరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily