Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్10/అక్షరం న్యూస్... దేశ్ ముఖ్ కబంద హస్తాల నుండి తన భూమిని దక్కించుకుని, దున్నేవారిదే భూమి అనే నినాదాన్ని బలంగా వినిపించిన చాకలి ఐలమ్మ భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి గుర్తుగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చిరస్మరణీయురాలై నిలిచిందని సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కట్టేబోయిన శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కట్టేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ, భూమి కోసం, భూక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం, పోరాడిన తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఐలమ్మ చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా కీర్తించబడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు పోతుల నరసింహారావు, అన్నం శ్రీనివాసరావు, సింగ్గు రమేష్, కట్టేబోయిన పిచ్చయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily