Sunday, 08 September 2024 06:33:48 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

తల్లాడ బస్టాండ్ ప్రాంగణంలో గుంతలకు మరమ్మత్తులు..

అక్షరం న్యూస్ కథనానికి స్పందించిన ఆర్టీసీ అధికారులు


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 24 July 2024 06:51 PM Views : 384

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ తల్లాడ జూలై 24 (అక్షరంన్యూస్) తల్లాడ బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. తల్లాడ బస్టాండ్ అధ్వానంగా మారిందని ఇటీవల అక్షరం న్యూస్ దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తకు స్పందించిన ఆర్టీసీ అధికారులు తల్లాడ బస్టాండ్ ప్రాంగణానికి మరమ్మతులు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రాంగణంలో గుంతల పడటంతో వాటిని మట్టి పోసి పూడ్చారు. అదేవిధంగా వర్షానికి కురిసిన నీరు బయటికి వెళ్లే విధంగా చుట్టూ సైడ్ కాలువ తీయించారు. ఈ సందర్భంగా ఖమ్మం ఇంజనీర్ సెక్షన్ ఆఫీసర్ షేక్. రహీం ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు తెరపిచ్చిన తర్వాత గుంతల్లో సీసీ రోడ్డు పోస్తామని తెలిపారు. అదేవిధంగా డ్రైన్ కూడా వచ్చే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బస్టాండ్ లోకి ప్రయాణికులు రావడం కోసం ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, నీలాద్రి ఆలయ డైరెక్టర్ దగ్గుల నాగిరెడ్డి పలు సమస్యలను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. బస్టాండ్ వెనుక ప్రాంతంలో శివాలయం నుండి వచ్చే ప్రజలు బస్టాండ్ లోకి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని, ప్రహరీ గోడ వద్ద పెద్ద గుంత ఉండటంతో ద్విచక్ర వాహనాలు, ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనికి స్పందించిన ఆర్టీసీ అధికారులు వాటిని కూడా మరమ్మతులు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధూపాటి నాగరాజు, కందికొండ నర్సిరెడ్డి, రాము, వెంకటేష్, తదితరులు ఉన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :