Sunday, 08 September 2024 08:29:41 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

ప్రభుత్వం జీవోలను సవరించి రైతులకు రుణమాఫీ చేయాలి..*

రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఇవ్వాలి..* *లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం..* *తల్లాడలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్..*


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 22 July 2024 05:16 PM Views : 202

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/తల్లాడ జూలై 22 (అక్షరంన్యూస్)* *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని అమలు చేసిన జీవోను సవరించి, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని నిబంధనలు పెట్టటం సరైనది కాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికే తెల్ల రేషన్ కార్డు అని ప్రతిపాదన చేస్తున్నప్పటికీ జీవోలో మాత్రం రేషన్ కార్డు ఉన్న వారికే అమలయ్యే విధంగా చేశారని గుర్తుచేశారు. వెంటనే ఆ జీవోలను మార్చాలన్నారు. జిల్లాలో ఐదు లక్షల మందికి పైగా రైతులు ఉంటే లక్షల లోపు 57, 375 మందికి వచ్చిందని, ఆ లెక్కన చూసుకుంటే సుమారు 3 లక్షల మందికి రావాల్సి ఉందన్నారు. తల్లాడలో 2500 మంది ఉంటే 300 మందికి, కుర్నవల్లిలో 1179 ఉంటే 307 మందికే రుణమాఫీ వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా రుణమాఫీ చేశామని ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రేషన్ కార్డుతో ముడి పెట్టకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులతో కలిసి ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ శీలం సత్యనారాయణ రెడ్డి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్, రైతు సంఘం నాయకులు అయినాల రామలింగేశ్వరరావు, రైతు సంఘం తల్లాడ మండల కన్వీనర్ నల్లమోతు మోహన్ రావు, చల్లా నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.*

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :