Sunday, 08 September 2024 08:14:53 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

తల్లడలో పడకేసిన పారిశుద్ధ్యం.!

ఎక్కడపడితే అక్కడ కుప్పల తిప్పలుగా వ్యర్ధాలు.. ఏ వీధిలో చూసినా పిచ్చి మొక్కలతో డ్రైనేజీలు దర్శనం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తల్లాడ అధికారులు.. మంత్రులు, ఎమ్మెల్యే ఆదేశాలను బేఖతరు చేస్తున్న అధికారులు..


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 16 July 2024 05:32 PM Views : 494

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : తల్లాడలో ప్రధాన రహదారుల వెంట వర్షపు నీరు.. ఖమ్మం/తల్లాడ జూలై 16 (అక్షరంన్యూస్) వేలకు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తూ కార్యాలయ గదులకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వాలు గ్రామాల్లో మెరుగైన వాతావరణ, పరిశుభ్రత కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పారిశుద్ధ్య పరిశుభ్రత కోసం ప్రత్యేక ట్రాక్టర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, మిగతా వర్కర్లు ఉన్నప్పటికీ గ్రామాల్లో ఎక్కడ చెత్త అక్కడే దర్శనమిస్తుంది. వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడ నీరు అక్కడే నిలిచి దోమలు, ఈగలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. ఇటువల్ల ప్రజలు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి వ్యాధులు బారిన పడిన సంఘటనలో అనేకు ఉన్నాయి. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాల్సిన అధికారులు వారి కార్యాలయాలకే పరిమితమై ప్రజలకు సమాధానం కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. పాగింగు, బ్లీచింగ్ చల్లి దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి వాటిని పట్టించుకోకుండా నిమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందునా మంత్రులు, ఎమ్మెల్యే ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వారి ఆదేశాలను కూడా ఖతారు చేయకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, మండల అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :