Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : -రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/,జూలై- 12, (అక్షరం న్యూస్ ) ఎరువులు రైతుల కు అందుబాటులో ఉంచాలని, ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్, పోత్గల్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పీ.ఏ.సీ.ఎస్. లలో ఈ - పాస్ యంత్రాలను, నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు. ఎరువులు ఎంత ధరకు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా స్టాక్ ఉండాలని ఆదేశించారు. వీరి వెంట ,జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, పీఏసీఎస్ సిబ్బంది సెక్రటరీ లు కృష్ణ, భార్గవ్ ఏ ఈ ఓ లు ,రైతులుతదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily