Sunday, 08 September 2024 08:18:03 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి... నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి...

గిరిజన చట్టాలను కాపాడాలి... అటవీ నియమాల చట్టం రద్దు చేయాలి... తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 17 July 2024 08:05 PM Views : 374

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ... మహబూబాబాద్/గార్ల /జులై 17/అక్షరం న్యూస్... అపార ఖనిజ సంపద కలిగిన బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని,దేశంలో గిరిజన హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని, గిరిజన చట్టాలను కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా హరి నాయక్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం స్థానిక పేరుమల్ల జగన్నాథం భవనంలో బానోత్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో భూక్యా హరినాయక్ మాట్లాడుతూ, పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యను పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అటవీ నియమాల చట్టంతో గిరిజన చట్టాలకు భంగం కలిగే ప్రమాదం ఉందని వెంటనే అటవీ నియమాలు చట్టాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రాల విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన చట్టంలో బయ్యారం హక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని, ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఏజెన్సీ ప్రాంత గిరిజన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ స్కూలుకు కేటాయించే సీట్ల సంఖ్యను పెంచాలని, స్కాలర్షిప్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీలో పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా కేలూత్ సాయికుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, శాంతి కుమార్, జిల్లా కమిటీ సభ్యులు జి పార్వతి, ఎల్ శ్రీను నాయక్, బి ఫుల్ సింగ్ నాయక్, సీతారాం నాయక్, దేవా నాయక్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :