Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ... మహబూబాబాద్/గార్ల /జులై 17/అక్షరం న్యూస్... అపార ఖనిజ సంపద కలిగిన బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని,దేశంలో గిరిజన హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని, గిరిజన చట్టాలను కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా హరి నాయక్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం స్థానిక పేరుమల్ల జగన్నాథం భవనంలో బానోత్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో భూక్యా హరినాయక్ మాట్లాడుతూ, పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యను పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అటవీ నియమాల చట్టంతో గిరిజన చట్టాలకు భంగం కలిగే ప్రమాదం ఉందని వెంటనే అటవీ నియమాలు చట్టాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రాల విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన చట్టంలో బయ్యారం హక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని, ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఏజెన్సీ ప్రాంత గిరిజన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ స్కూలుకు కేటాయించే సీట్ల సంఖ్యను పెంచాలని, స్కాలర్షిప్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీలో పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా కేలూత్ సాయికుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, శాంతి కుమార్, జిల్లా కమిటీ సభ్యులు జి పార్వతి, ఎల్ శ్రీను నాయక్, బి ఫుల్ సింగ్ నాయక్, సీతారాం నాయక్, దేవా నాయక్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily