Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -18(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారుల రాక తో .గురువారం . వ్యాపార సముదాయాల బంద్ చేశారు.జీఎస్టీ అధికారుల ముస్తాబాద్ మండల కేంద్రం లో ప్రతి షాప్ కు తిరుగుతుండడంతో . వ్యాపారస్తుల గుండెల్లో గుబులు చెందారు ముస్తాబాద్ పట్టణంలో జీరో దందా మరోసారి రుజువైంది. పట్టణంలో జీఎస్టీ అధికారుల తనిఖీలకు భయపడి కొన్ని వ్యాపార సముదాయాలు ఎక్కువగా బట్టల షాపులు, మొబైల్ షాపులు జీఎస్టీలు కట్టకుండా వ్యాపారస్తుల బంద్ నిర్వహించారు. సామాన్య ప్రజలపై జిఎస్టి పేరుతో వసూలు చేస్తున్న వ్యాపారస్తులు లాభాలను గడిస్తున్నారు కానీ జీఎస్టీలు కట్టడం లేదని జీఎస్టీ కమర్షియల్ టాక్స్ అధికారుల తనిఖీల వల్ల రుజువైంది. వ్యాపార సముదాయాలు బంద్ చేయడంలో ఆంతర్యం ఏమిటి అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.... అయితే వాళ్ళు వచ్చింది అందుకు కాదండోయ్. వచ్చిన అధికారులను వివరణ కోరగా ప్రభుత్వం కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) లైసెన్స్ తీసుకోని వారి ని గుర్తించి ప్రతి దుకాణం కు ఉచితంగా జీఎస్టీ లైసెన్స్ అందచేయాలనీ స్పెషల్ డ్రైవ్ చెపట్టినట్లు సిరిసిల్ల సర్కిల్ ఏ సి టీ ఓ రజాక్ తెలిపారు.ప్రతి షాప్ తిరిగి వారి వద్ద నుండి యజమాని పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకోని త్వరలో అందచేస్తామని తెలిపారు. మొత్తానికి ప్రజలు వినియోగదారులు కొనుగోలు చేసే వస్తవులు సామాగ్రి పై జీ ఎస్టీ పేరుతో డబ్బులను అదనంగా వసూలు చేసి వ్యాపారాలు పన్నులు కట్టకుండా మోసం చేయడం పై పలువురు మండిపడుతున్నారు వీరి వెంట సిరిసిల్ల జీ ఎ స్టీ సీనియర్ ఆస్టెంట్ ఇంతీయజ్ ఉన్నారు .
.
Aksharam Telugu Daily