Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ... మహబూబాబాద్ /గార్ల /జులై 13/అక్షరం న్యూస్... శాస్త్రవేత్తలు కనుగొనలేని ఎన్నో అద్భుతాలు పూరీ జగన్నాధ స్వామి ఆలయం మరియు రధయాత్రలో దాగి ఉన్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన పూరీ జగన్నాధ్ రధయాత్ర గార్ల పట్టణంలో శ్రీరామ దండు 108 కమిటీ, గణేష్ యువసేన, వర్తక సంఘం కమిటీల ఆధ్వర్యంలో గార్ల ఇస్కాన్ కమిటీ, ఖమ్మం ఇస్కాన్ కమిటీల సహకారంతో గార్ల లో పూరీ జగన్నాధ్ రధయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవాన్ స్వరూపం సంస్కృత భాషలో జగం అంటే విశ్వం, న్నాథ అంటే భగవంతుడు అని అర్ధం, అంటే విశ్వం అంత పరిపాలించే భగవంతుడు పూరీ జగన్నాధ స్వామి రధయాత్రలో పాల్గొనే సువర్ణ అవకాశం గార్ల ప్రజలకు లభించింది. పురాణాల ప్రకారం పూరీ రధయాత్రలో పాల్గొన్న భక్తులు 100యాగాలకు సమానమైన పుణ్య ఫలాలు పొందుతారని ప్రతితి. సనాతన ధర్మంలో జగన్నాధుని శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించి పూజిస్తారు. రధయాత్ర అనంతరం గార్ల వర్తక సంఘం భవనంలో జగన్నాధుడు, సుభద్రాయం మరియు బలభద్రాయా స్వామికి చప్పన్ భోగ్ నైవేద్యంలతో స్వామి వారికీ నివేదన, మంగళహారతి కార్యక్రమం నిర్వహించారు. పూరీ జగన్నాధుని రధయాత్ర ను చూసేందుకు భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో భక్తులు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్, శీలంశెట్టి రమేష్, జాటోత్ ఝాన్సీ లక్ష్మి, కట్టా రమేష్, గంగావత్ లక్ష్మణ్ నాయక్, భూక్యా రాజు, గాజుల గణేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily