Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -11(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ లోని ప్రజాపాలన సేవా కేంద్రాన్నిరాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం పరిశీలించారు. ముస్తాబాద్ లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ గురువారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆన్ లైన్ లో అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు నమోదు చేసే విధానాన్ని పరిశీలించారుదాదాపు 30నిముషాలు ఆపరేటర్ వద్ద నిలబడి ప్రతి అంశము పై అడిగి తెలుసుకున్నారు . దరఖాస్తు అందజేసే క్రమం లో యజమాని ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్ నకలు పత్రాలు జత చేసిన విద్యుత్, గ్యాస్ తదితర ఆరు గ్యారంటీ లు అర్హులైన వారికీ ఆన్ లైన్ లో చూపెట్టకపోవడం, ఎడిట్ ఆప్షన్,,రేషన్ కార్డు లేని వారు ఆధార్ జిరాక్స్ పత్రం . లు ఎందుకు అప్లోడ్ కాలేదో ఆపరేటర్ ను అడిగి తెలుకున్నారు.. వచ్చిన అర్జీదారులతో మాట్లాడారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన లో వచ్చిన అర్జీలలో కొన్ని ఆన్ లైన్ లో అర్హులుగా ఉన్న వారి నుండి అందించిన అన్ని రకాల దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు.వీరితో ఎంపీడీఓ రాజేందర్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily