Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : .. మహబూబాబాద్ /గార్ల /జులై 16/అక్షరం న్యూస్... గాడేపల్లి నర్సమ్మ భర్త (లేటు )రామయ్య , మహబూబాబాద్ జిల్లా,గార్ల మండలం, జెండా బజార్ కు చెందిన ఈమెకు ముగ్గురు కుమారులు.చిన్నతనం నుంచి పెంచి చదివించి వాళ్లకి పెళ్లిళ్లు చేసి వారి జీవితాన్ని తీర్చిదిద్దిన తల్లిని రోడ్డు పాలు చేసిన కొడుకులు. ఉన్న మూడు ఎకరాల భూమి మరియు ఇల్లు ఉండి కన్నతల్లిని రోడ్డుపాలు చేసి దిక్కుతోచని స్థితిలో కన్నపేకు బంధం కు కుసంతా కనికరం లేకుండా రోడ్డున పడేసిన కొడుకులపై తల్లి బాగోగులు చూడని కుమారులుకు తల్లి ఆస్థి పై ఎలాంటి హక్కు ఉండదని సమాజంలో ఇలాంటి కొడుకులు ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే. సమాజంలో వీళ్ళని ఒక రకంగా చూసి సిగ్గులేకుండా ఇలా కూడా ఉంటారా అని నాకు మూడు పూటలా అన్నం మరియు ఉండడానికి ఇల్లు సౌకర్యం కల్పించాలని కోరిన కన్న తల్లి.ఆమె మాట్లాడుతూ తనకు ఉన్న మూడు ఎకరాలు, ఇల్లు, ఇంటి స్థలం, పంచుకొని ప్రతి నెలకు ఒకరు నా బాగోగులు చూసుకుంటామని చెప్పి ఇల్లు, స్థలం, పొలం పంచుకున్నారు. తరవాత నుంచి తనను రోడ్డుపై పడేసినారని కన్నీటి పర్వం అయ్యారు.తన నివాసం కొరకు ఉన్న ఒక గదిని ని ఈ మధ్యనే కులగొట్టారు. తను నివాసం ఉండే విధి లో ఉన్న పెద్ద మనషుల వద్దకు వెళ్లి గోడు చెప్పుకున్న ఎవరు పట్టించుకోవట్లేదు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన పోలీస్ వారు చిన్న చిట్టీ ముక్క ఇచ్చి పంపించారు ఇంతవరుకు పరిస్కారం దొరకలేదు మొన్న నా దగ్గర ఉన్న చెవి దిద్దులు, మేడలో ఉన్న గొలుసు, డబ్బులని తన రెండో కొడుకు రాజేష్ తీసుకొని కొట్టి వెళ్ళిపోయాడు కావున గార్ల మండల పెద్దలు,రాజకీయ నాయకులు, మీడియా మిత్రులు,పోలీస్ వారు ఆ తల్లికి న్యాయం చేయాలని కోరారు.
.
Aksharam Telugu Daily