Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : మహబూబాబాద్ /గార్ల /జులై 17/అక్షరం న్యూస్... గార్ల పట్టణ కేంద్రంలోని స్థానిక సిహెచ్ సి ఆసుపత్రి సమస్యల వలయంలో సతమతమవుతుందని ప్రభుత్వ ఆసుపత్రి లో నేలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఐద్వా మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గాడిపల్లి ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్దానిక సిహెచ్ సి ఆసుపత్రి లో పూర్తి స్దాయి లో వైద్యులను నియమించాలని కోరారు. ప్రతిరోజూ మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి ప్రజలు చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి వస్తే వైద్యులు లేకపోవడం మూలంగా సకాలంలో వారికీ వైద్యం అందడంలేదని అన్నారు. రోగుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రి లో సౌకర్యాలు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం తో ఆసుపత్రి కి వస్తున్న ప్రజలకు వైద్యసేవలు అందటం లేదన్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంలో స్దానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరారు.డిమాండ్ల పరిస్కారం కై ఐద్వా నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుందని తెలిపారు.అనంతరం ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో గార్ల పురవిధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.దీక్షలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవితా, మండల అధ్యక్ష,కార్యదర్శులు మల్లెల నాగమణి, అలవాల సత్యవతి, నాయకులు సిహెచ్ మౌనిక, టి.రమా తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily