Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ జూలై 11 (అక్షరంన్యూస్) తల్లాడ రింగురోడ్డు రోజురోజుకు శిధిలావస్థకు చేరుతుంది. రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఇనుప డ్రిల్స్ విరిగిపోతున్నాయి. వివిధ వాహనాలు ఢీకొని డ్రిల్స్ విరిగిపోయి ఉన్నప్పటికీ వాటికి మరమ్మత్తులు చేయాల్సిన అధికారులు తూతూమంత్రంగా వదిలేస్తున్నారు. వాటిని ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. డివైడర్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు ఇటీవల కాలంలో జరిగాయి. దీంతో మండల అధికారులు తూతూమంత్రంగా డివైడర్ మధ్యలో పూలకుండీలను పెట్టి చేతులు దులుపుకున్నారు. కనీసం ప్రమాద హెచ్చరిక, సూచిక బోర్డులు పెట్టకుండా పూలకుండీలు పెట్టి మసి పూసి మారేడు కాయచేసిన సందంగా చేస్తున్నారు. రింగు చుట్టు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు కనిపించకుండా పిచ్చి మొక్కలు మాత్రం ఏపుగా పెరిగి పెరగటంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు రింగ్ రోడ్డు చుట్టూ భారీగా వరద నీరు చేరుతుండటంతో పాటు ఆ ప్రాంతంలో నీరు నిల్వ ఉండటంతో డ్రైనేజీ గుంత కనిపించక అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మండల కేంద్రానికి పట్టుకొమ్మగా ఉన్న రింగురోడ్డుని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ ఆ నిధులను ఏం చేస్తున్నారు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. సంబంధించిన అధికారులు ఏనాడు కూడా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తల్లాడ మేజర్ పంచాయతీలో నర్సరీ నుండి వేల సంఖ్యలో పంచాయతీ మొత్తం మొక్కలు నాటితే అవి ఇప్పటివరకు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. సరైన నీరు వాటికి ఏర్పాట్లు చేయకపోవడంతో చెట్లు విరిగి కనిపించడం లేదు. కేవలం అక్కడక్కడ మాత్రమే చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పల్లె ప్రకృతి వనం కూడా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయింది. లక్షలు హెచ్చించి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని మాత్రం ప్రజలకు అందుబాటులో తేవటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి చేతుల మీదుగా ఓ వెంచర్ లొ మొక్కలు నాటించారు. హరితహారంలో నాటిన మొక్కల్లాగానే వీటిని కూడా పట్టించుకుంటారో లేరోనని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. హరితహారం, వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాలు లక్షలాది రూపాయల వెచ్చించి మొక్కలు నాటాలని ఊరూరా ప్రచారంతోపాటు నిధులను సమకూరుస్తుంటే మండల అధికారులు తీరువల్ల ఆ పథకాలు అభాష్ పాలు అవుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తల్లాడ మండల అధికారులపై విచారణ చేసి జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily