Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -11(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో కేంద్ర హోం శాఖ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 53వ జన్మదిన సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు, ముస్తాబాద్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు జంగా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన బండి సంజయ్.. ఇప్పుడు ఏకంగా కేంద్ర సహాయ మంత్రి పదవిని చేపట్టారని,బీజేపీని గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత సంజయ్దే అని అన్నారు వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నిండు నూరేళ్లు జీవించి కేంద్ర స్థాయిలో మరిన్ని పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిలివరీ మల్లేశం, మేకల రాజు, బిక్షపతి, శ్రీకాంత్, బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily