Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : (ఓదెల/పెద్దపల్లి, జులై 14 (అక్షరం న్యూస్): ఓ దెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే విజయ రమణారావు మల్లికార్జున స్వామి జాతర విశేషం ఉగాది నుండి మొదలుకొని ప్రతి ఆదివారం బుధవారం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం కోసం నలుమూలల జిల్లాలనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తులు అపారమైన నమ్మకం కోరుకున్న వారికి కొంగు బంగారం అయితదని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులకు ఒక నమ్మకం ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే పెద్దపట్నం మరియు అగ్నిగుండ మహోత్సవానికి ఆదివారం రాత్రి స్వామివారికి పెద్దపట్నం ఒగ్గు పూజారులు వేస్తారు ఆ పెద్దపట్నంపై స్వామివారిని కొలువుదీర పెడతారు ఆ తర్వాత స్వామివారి జీవిత చరిత్రను ఒగ్గు పూజారులు కథ రూపంలో చెప్పారు. తర్వాత పెద్దపట్నం పై శివసత్తులు నాట్యం చేసి ఆ యొక్క పసుపు కుంకుమ ను దేవుడి ప్రసాదంగా ప్రతి ఒక్కరు తీసుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహోత్సవానికి భక్తులు అధిక పాల్గొన్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా స్వామివారి సన్నిధానం చేరి స్వామి వారి పెద్దపట్నం మహోత్సవాన్ని తిలకిస్తున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు అదేవిధంగా భక్తుల కొలహాల మధ్య స్వామి వారి పెద్దపట్నం కనుల పండుగ జరిగింది భక్తులు వివిధ జిల్లాల నుండి కాక వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పెద్దపట్నం మహోత్సవం చూసి మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా తెల్లారు ఐదు గంటలకు అగ్నిగుండ మహోత్సవంలో భక్తులు పుణ్య స్థానాల ఆచరించి అగ్ని ప్రవేశం చేశారు పెద్దపట్నం మహోత్సవాన్ని ముగింపు పలుకుతారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ మేకల మల్లేష్ ఆలయ ఈవో బి సదయ్య జూనియర్ రికార్డ్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి మరియు ఆర్య సిబ్బంది అన్ని సౌకర్యాలు ప్రత్యేక విశేషమేమిటంటే సినీ నిర్మాత అశోక్ తేజ తన మిత్ర బృందంతో పెద్ద పట్నం బ్రహ్మోత్సవాన్ని పూర్తి అన్ని హంగులతో చిత్రీకరించారు స్వామివారి బ్రహ్మోత్సవాన్ని చిత్రీకరించడం చాలా ఆనందంగా ఉందని అశోక్ తేజ అన్నారు
.
Aksharam Telugu Daily