Sunday, 08 September 2024 08:26:16 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

అధ్వానంగా తల్లాడ నర్సరీ..

మొక్కలు పెంచడంలో అధికారుల నిర్లక్ష్యం.. మొక్కలు నాటే సమయంలో కనిపించని వైనం


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 15 July 2024 07:01 PM Views : 620

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/తల్లాడ జూలై 15 (అక్షరంన్యూస్) తల్లాడ మేజర్ పంచాయతీ నర్సరీ అధ్వానంగా తయారయింది. జూన్ లో మొక్కలతో కళకళ డాల్సిన నర్సరీ మొక్కలు లేక మోడులతో వెలవెల పోతుంది. జులైలో వనం మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే సమయం ఆసన్నమైనప్పటికీ అధికారులు మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు మండల కేంద్రమైన తల్లాడలోనే మొక్కలు నాటే పరిస్థితి లేదు. అసలు నర్సరీని అధికారులు పట్టించుకున్న పాపాన పోవటం లేదు. వర్షపు నీరు వస్తే చుట్టుపక్కల నీరు చేరి చెత్తాచెదారాలతో దుర్గంధం వెదజల్లుతుంది. నర్సరీలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. వన మహోత్సవంలో భాగంగా ఇటీవల సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి తల్లాడ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ మొక్కలు కూడా తల్లాడ నర్సరీ నుండి కాకుండా ఎక్కడివో ఆప్పటికప్పుడు తీసుకొచ్చి వేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. నర్సరీలో ఎండ, కోతులు రక్షణకు షెడ్డు చుట్టూ క్లాత్ ఏర్పాటు చేయాల్సి ఉండగా అవి అసంపూర్తిగా వదిలేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించారు. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి చేతులమీదుగా సత్తుపల్లిలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలో మంత్రుల పర్యవేక్షణలో ఊరూరా మొక్కలు నాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మంత్రులు సత్తుపల్లి నియోజకవర్గంలో నాటినప్పటికీ ఆ నియోజకవర్గంలో ఉన్న తల్లాడ మండలంలో మొక్కలు నాటడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. గతంలో ఈ నెలలో మొక్కలను ట్రాక్టర్ పై తీసుకువచ్చి ఒక్కో మనిషికి నాలుగు మొక్కలు చొప్పున పంపిణీ చేసిన అధికారులు ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా వారు ఏడాది మొక్కలు పెంచడంతోపాటు పంపిణీ చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇకనైనా తీరు మార్చుకొని అధికారులు పనిచేయాలని, నేను పక్షంలో ఉన్నతాధికారులు ఈ మండలాధికారులపై చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :