GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఫిబ్రవరి -23(అక్షరం న్యూస్ ) ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనము డీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం లో చోటు చేసుకుందినామపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన లలిత ఎల్లం ల కుమారుడు.చందు (25)ఆదివారం రాత్రి గూడెం గ్రామం కు ద్విచక్ర వాహనము పైన వెళుతున్న క్రమంలో గూడెం సమీపంలో దుర్గమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం డికొట్టడం తో తీవ్ర గాయల తో రహదారి పైన పడి ఉండడం తో స్థానికులు క్షేత్ర గాత్రున్ని. సిద్దిపేట లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రి కి తరలించారు. చికిత్స పొందుతూన్న చందు సోమవారం మధ్యాహ్నం మృతి చెందడం తో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగాని ఒక్క కొడుకు మృతి చెందడం తో తల్లితండ్రుల శోకం కలచివేసిందిఘటన స్థలాన్ని స్థానిక ఎస్ ఐ గణేష్ పరిశీలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు
.
Aksharam Telugu Daily