Thursday, 15 January 2026 06:40:40 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. వాటి కోసం రూ.10 కోట్ల నిధులు మంజూరు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 January 2026 07:58 AM Views : 64

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ (SFC) ద్వారా రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. మంజూరైన ఈ నిధులను మున్సిపాలిటీల్లోని అంతర్గత రోడ్ల మరమ్మతులు, మురుగునీటి కాలవల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ మరియు పెండింగ్‌లో ఉన్న అత్యవసర పనుల కోసం వినియోగించనున్నారు. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిధులను నేరుగా మున్సిపాలిటీలకు మళ్లించారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ (SFC) ద్వారా రూ. 10 కోట్ల నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు దఫాలుగా నిధులను కేటాయించిన ప్రభుత్వం... తాజా కేటాయింపులతో పట్టణాల్లో ఆగిపోయిన పనులకు ఊపిరి పోసింది. పట్టణాభివృద్ధి కోసం నిధులు విడుదల మున్సిపాలిటీలకు విడుదల చేసిన ఈ నిధులను ప్రధానంగా ప్రజల రోజువారీ అవసరాలను తీర్చే మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన డ్రైనేజీ పనులు, అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయడం.. పట్టణాల్లో మురుగునీటి కాలవల శుభ్రత, దోమల నివారణ చర్యల కోసం అత్యవసర నిధుల కేటాయింపు.. రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం పని చేయని వీధి దీపాలను బాగు చేయడం, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు చేయడం.. వర్షాకాలం లేదా ఇతర కారణాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ వంటి అత్యవసర మరమ్మతులు చేయడం అనేవి వీటిలో భాగంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి విషయంలో వికేంద్రీకరణ పద్ధతిని అనుసరిస్తోంది. స్థానిక సంస్థలు ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించినప్పుడే క్షేత్రస్థాయిలో సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో నిధుల విడుదల ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని నివారించేందుకు... రాష్ట్ర వాటా నిధులను నేరుగా మున్సిపాలిటీల ఖాతాల్లోకే మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా.. పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా మున్సిపాలిటీల సరిహద్దుల్లో అనుమతి లేని నిర్మాణాలను అరికట్టడం, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మంజూరైన ప్రతి రూపాయికి లెక్క ఉండేలా.. పనుల నాణ్యతలో రాజీ పడకుండా ఉండేలా మున్సిపల్ కమీషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 138 మున్సిపాలిటీల్లో చిన్న మున్సిపాలిటీలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచడం కూడా ఈ నిధుల విడుదలలో ప్రధాన ఉద్దేశంగా ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :