Saturday, 07 February 2026 04:32:04 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు -రగుడు వద్ద 20 లక్షల నగదు పట్టివేత

.


Jakkani Rajaramesh , SIRCILLA.

Reporter

Date : 30 January 2026 06:13 PM Views : 236

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల, జనవరి-30, (అక్షరం న్యూస్): శుక్రవారం ఉదయం సుమారు 07:45 గంటలకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం, రగుడు వద్ద ఉన్న ఎస్ ఎస్ టి బృందం చెక్‌పోస్ట్ లో వాహన తనిఖీలు నిర్వహించగా, ఈ సందర్భంగా టీజీ 23 ఏ 1524 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని గణాచారి సాంభాషివ్, తండ్రి శంకరయ్య, నివాసం ఇంటి నం. 6-3-65, మార్కెట్ రోడ్, వేములవాడ పట్టణం, రాజన్న సిరిసిల్ల జిల్లా గల వ్యక్తి, తన కారులో లెక్కలలో లేని. అనుమానాస్పదమైన నగదు రూ. 20,00,000/- రూపాయలు ఇరవై లక్షలు మాత్రమే తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినది.ఆ నగదు మొత్తాన్ని ఎన్నికల నిబంధనలు చట్టపరమైన విధానాల ప్రకారం, ఎస్ఎస్టి బృంద ఇన్‌చార్జ్ జి. ఆనంద్, ఏపీఆర్ఓ సమక్షంలో, మధ్యవర్తుల పంచనామా సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడమైనది. ఆ నగదు యొక్క మూలం ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ దర్యాప్తు కొనసాగుతోంది. అని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కె.కృష్ణ తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :