Sunday, 23 August 2026 03:59:16 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మంత్రి కొండ సురేఖ ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ఒకవైపు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పదవిని అనుభవిస్తూనే.. మరోవైపు ఆమె కూతురు కొండ సుస్మిత ముఖ్యమంత్రి రే

రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 22 August 2026 03:37 PM Views : 31

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : * అక్షరం ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాదులోని అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద సహచర ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూతురు వాక్యాలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండ సురేఖ బుకాయించడం సరికాదన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేసిన వీరోచిత పోరాటం ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిని కట్టబెడితే ఆ పదవిని అనుభవిస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి పై, ఆయన సోదరులపై కొండ సురేఖ కుటుంబం విమర్శలకు దిగడం పట్ల ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. నిద్రాహారాలుమాని సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కష్టార్జితం వల్ల, మరోవైపు ఎన్నో అవమానాలు, నిర్బంధాలను, కఠినమైన జైలు జీవితాలను అనుభవించిన రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నగ్నసత్యాన్ని ఎవరు కాదనలేరన్నారు. ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ సీనియర్ నాయకురాలిగా గుర్తించి బీసీ మహిళగా క్యాబినెట్ మంత్రిగా కొండ సురేఖకు అవకాశం కల్పిస్తే, ఆమె చేసే రాజకీయం చూస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల మనసులు ఎంతగానో గాయపడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కూతుర్లు, కుమారులు చేసే పనులకు తల్లిదండ్రులు బాధ్యత వహించడం సహజమనే కనీస సాంప్రదాయాలకు కొండా సురేఖ తిలోదకాలు ఇస్తోందని అన్నారు. అలాంటిది ఏకంగా సీఎం పైనే తీవ్రమైన విమర్శలకు దిగిన తన ఇంట్లోనే ఉంటున్న తన కూతురు వాక్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు సురేఖను ప్రశ్నించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :