Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 8 తల్లాడ (అక్షరంన్యూస్)* తల్లాడ లో పారిశుద్ధం పడకేసింది. ఏ వార్డులోకి వెళ్లిన మురికి నీరు, చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. అసలే అకాల వర్షాలు రావడంతో సీజన్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. మురికి నీరు కుళ్లిపోయిన వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధించిన అధికారులు చూసి చూడంగా వ్యవహరిస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ కార్యాలకు పరిమితం అవుతున్నారు. తప్ప గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిన పాపాన పోలేదు. కార్యాలయాల్లో ఉంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మండల అధికారులపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు ఎవరు కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టిన సందర్భాలు లేవు, ఈ సమస్యలు రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని, అధికారులు పట్టించుకోకపోతే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని మండల ప్రజలు కోరారు. అదేవిధంగా: తల్లాడ మండలం మల్సూర్ తండా గ్రామపంచాయతీలో డ్రైనేజీల్లో మురికి నీరు నిండి,కుళ్ళిపోయిన వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతుంది. మురికి నీళ్లలో దోమలు వృద్ధి చెంది మలేరియా టైఫాయిడ్, డెంగు జ్వరాలు వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ జ్వరంతో మృతి చెందినట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఇకనైనా ఆ గ్రామ కార్యదర్శి మండల అధికారులు స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily