Wednesday, 04 March 2026 01:41:30 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పేలుడు పదార్థాలపై జిల్లా టాస్క్ ఫోర్స్, ముస్తాబాద్ పోలీసుల ఆకస్మిక దాడులు

పలు పేలుడు పదార్థాలు, సంబంధిత సామాగ్రి స్వాధీనం... ముగ్గురు పై కేసు నమోదు..


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 22 July 2025 08:25 PM Views : 2006

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -22(అక్షరం న్యూస్ ) ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న పేలుడు పదార్దాలైన జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనోటర్స్‌ బాక్సులను టాస్క్ ఫోర్స్, ముస్తాబాద్ పోలీసులు పట్టుకున్న సంఘటన ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం లో చోటుచేసుకుంది ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం లో నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామానికి చెందిన గడిపర్తి శ్రీనివాస్ రావు అతని యజమాని ఓర్పు సాయి మల్లు ఆదేశాల మేరకు టాటా వాహనము లో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు తీసుకువచ్చి నామ పూర్ గ్రామంలోని శివరాత్రి రాజు అనే వ్యక్తి కి బండ పనుల నిమిత్తం అమ్ముతుండగా నమ్మధగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీ ఐ నటేష్, ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు వారి వద్ద నుండి 2600 జిలెటిన్ స్టిక్స్, 405ఐడియాల్ బూస్టర్ జిలిటెన్ స్టిక్స్,6000వేల మీటర్ల ఐడియాల్ కార్డ్స్ వైరు, 175డెటోనేటర్స్, తో పాటు టాటా యోదా వాహనము స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ రావు, శివరాత్రి రాజు, ఓర్పు సాయి మల్లు అనే ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చెప్పట్టి నట్లు ఎస్ ఐ గణేష్ తెలిపారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ .. ఎవరు కూడా ప్రజా నివాస ప్రాంతాల్లో ఎలాంటి లైసెన్స్ లేకుండా జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచుతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు ఎవరైనా వినియెగించాలనుకుంటే దానికి సబంధిచిన అనుమతి లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :