AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ జూలై 30-- పెద్దాడ సూర్య త్రినాథ వెంకట నరసింహ కుమార్ ఆశాలత దంపతుల ప్రథమ పుత్రుడు డాక్టర్ గీతానంద పార్వతి కాంత్ ఇందిరా ప్రవల్లిక ల పెళ్లిరోజు సందర్భంగా పాత చర్ల లో గల శ్రీ సీతారామ లక్ష్మణ సమేత భక్తాంజనేయ స్వామి దేవాలయానికి ఇరువైపులా శంకు చక్రాలు తీర్చిదిద్దిన అందమైన రామచిలుకల హంగులతో కూడిన మకర ధ్వజం లేదా మకర తోరణాన్ని సమర్పించారు.ముందుగా ఆలయ అర్చకులు ఆవుపాలతో సంప్రోక్షం చేసి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత భక్తాంజనేయ స్వామి వారికి మకర తోరణాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో మచ్చ వీర్రాజు నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు పంజా రాజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily