P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జులై 04 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని మల్లికార్జున స్వామి సమీపంలో ఓదెలలో సిమెంటు బస్తాలు దింపేసి వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది మండలంలోని రూపు నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజేందర్ యాదవ్ 38 తన బైక్ తో పెగడపల్లి వైపుకు వెళుతున్నాడు అదే తరుణంలో రోడ్డు కు అవతలి వైపు ఆలయానికి వచ్చిన భక్తుల సంబంధించిన కారు ఒకటి పార్కింగ్ చేసి ఉండడంతో మృతుడి వెనుకనే వచ్చిన లారీ బైకు వెనుకనుండి బలంగా ఢీకొట్టడంతో కింద పడిపోయాడని అదే స్పీడ్ తో బైక్ ని తొక్కి దానిపై నుండి లారీ వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పలువురు తెలిపారు మృతి చెందిన వ్యక్తి రూపు నారాయణపేట గ్రామానికి చెందిన రాజేందర్ యాదవ్ గ్రోమోర్ లో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడని మృతి చెందిన రాజేందర్ కు భార్య శిరీష ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు రిషి కుమార్ 3 సంవత్సరాలు పెద్ద కుమారుడు లడ్డు 5 సంవత్సరాలు ఉన్నట్టుగా స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంలో మృతి చెందిన రాపర్తి రాజేందర్ యాదవ్ కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు పలువురిని కలచివేసింది తన తల్లి తన భార్య విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది
.
Aksharam Telugu Daily