GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జూలై 5 అక్షరం న్యూస్; విద్యార్థులు చదువుల్లో రాణించి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎసీపీ గజ్జి కృష్ణ యాదవ్ అన్నారు.పెద్దపల్లిలో మహాత్మ జ్యోతిభాపూలే పాఠశాల, కళాశాల విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఎసీపీ గజ్జి కృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మనకు ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని తల్లి తండ్రి తరువాత ఒక గురువు మాత్రమే మన ఎదుగుదలకు దోహదపడతారని విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను వివరించారు. తాను కూడా గురుకులంలోనే చదివానని గురువులు నేర్పిన చదువుతో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదిగి మీ ముందు నిల్చున్నానని ఆయన బాల్యస్మృతులను గుర్తుచేసుకున్నారు. సినిమాలు వేరు జీవితం వేరని ఇంటర్ నెట్ ప్రపంచంలో మంచి చెడు తెలుసుకొని మంచిని స్వీకరించాలని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసవుతూ యువత పెడదారి పడుతున్నారని సక్రమ మార్గంలో పయనిస్తే జీవితం పూల వనంలా మారుతుందన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు తారసపడినా భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చదువుల్లో బాలికలదే పై చేయి ఉందని ఈ విద్యా సంవత్సరం కూడా బాగా చదవాలన్నారు. తల్లి దండ్రులతో ప్రేమగా ఆప్యాయంగా నడుచుకోవాలని క్రమశిక్షణతో మంచి పేరు తెచ్చుకొని జిల్లా కీర్తిని చాటాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమాజంలో మత్తుపదార్ధాలను నిర్మూలించాలంటూ ప్రతిజ్ఞ చేసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు, జ్యోతిబాపూలే కళాశాలల ఆర్ సీఓ ఎం.అంజలి, ప్రిన్సిపల్ మణిదీప్తి, నశా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily