Monday, 28 April 2025 09:02:03 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

విషాద యాత్రగా మారిన విహార యాత్ర.. కేరళ రాష్ట్రం పున్నమడలో హౌస్‌బోట్ నుండి పడి, ముస్తాబాద్ బిటెక్ విద్యార్థి దుర్మరణం..

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 05 March 2025 07:07 PM Views : 1943

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -05(అక్షరం న్యూస్ ) విద్యార్థుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ యువకుడి ప్రాణం పోయింది. విహారయాత్ర విషాదయాత్రగా మిగిలింది.వివరల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రనికి చెందిన , హైదరాబాద్ పట్టణంలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, ముత్యాల దేవేందర్- శారద దంపతుల ఏకైక సంతానం సాయిచరణ్ (21) హైదరాబాద్ లోని ఒక కళాశాలలో బి -టేక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల కు చెందిన స్నేహితులతో సోమవారం ఉదయం కేరళ రాష్ట్రం పున్నమడ వెళ్లారు అక్కడ ప్రారంభ స్థానం నుండి పడి మునిగిపోయి, మృతి చెందాడు. విహారయాత్రలో భాగంగా ఎనిమిది మంది సహచర బి-టెక్ విద్యార్థులతో సాయిచరణ్ అలప్పుజ చేరుకున్నాడు. పున్నమడ జెట్టీ తూర్పు వైపున ఆపి ఉంచిన హౌస్‌బోట్ నుండి ఆ యువకుడు గట్టులో పడిపోయాడని . సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సాయిచరణ్ లేడని స్నేహితులు గమనించారు. అలప్పుజ నుండి అగ్నిమాపక దళం స్కూబా బృందం నిర్వహించిన శోధనలో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. సహచర విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. మృతుని శవం పోస్టుమార్టం అనంతరము బుధవారం స్వగ్రామం ముస్తాబాద్ కు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.. ఈ ఘటన ముస్తాబాద్ మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని వ్యక్తపరిచి  ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతుని అంతిమ వీడ్కోలులో ప్రభుత్వ విప్ తో పాటు కాంగ్రెస్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కాంగ్రెస్ , పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, భాను, నరేష్, మాజీ ఎంపీపీలు జనగామ శరత్ రావు , అక్కరాజు శ్రీనివాస్, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, నాయకులు సర్వర్ పాష, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :